ఆ ప్రముఖ క్రికెటర్ చెప్పిన మాట వినుంటే... కరుణ్ నాయర్ కెరీర్ ముగిసేదేమో!
Mon Jun 16, 2025 15:01 Sports
సూపర్ ఫామ్లో ఉన్న కర్ణాటకకు చెందిన బ్యాటర్ కరుణ్ నాయర్ గురించి ఇప్పుడు ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల క్రితం ఓ ప్రముఖ క్రికెటర్ ఇచ్చిన సలహాను గనక అతను పాటించి ఉంటే, ఇప్పుడు ఇలా భారత టెస్టు జట్టులో సభ్యుడై ఉండేవాడు కాదేమో. ఆ క్రికెటర్ మాటలు పట్టించుకోకుండా, పట్టుదలతో శ్రమించి మళ్లీ జాతీయ జట్టులోకి ఎంపికయ్యాడు కరుణ్. దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కరుణ్ నాయర్ టీమిండియా టెస్టు జట్టులోకి పునరాగమనం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, రెండేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటనను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. "నాకు ఇప్పటికీ గుర్తుంది. ఓ ప్రముఖ భారత క్రికెటర్ రెండేళ్ల క్రితం నాకు ఫోన్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుని, ఆర్థికంగా భరోసా ఇచ్చే విదేశీ టీ20 లీగ్లలో ఆడుకోమని సూచించాడు. అతడు చెప్పినట్లు చేయడం చాలా సులువే. కానీ, నా లక్ష్యం తిరిగి భారత జట్టుకు ఆడటమే.
ఇది కూడా చదవండి: మాపై నమ్మకంతో ఎన్డీయేను ప్రజలు మూడుసార్లు గెలిపించారు! ప్రస్తుతం 52 కోట్ల మందికి..
ఆ సంఘటన జరిగి రెండేళ్లు గడిచాయి. ఇప్పుడు నేను మళ్లీ టీమిండియాలో చోటు దక్కించుకున్నాను" అని కరుణ్ నాయర్ ఆ ఇంటర్వ్యూలో వివరించారు. జూన్ 20 నుంచి ఇంగ్లండ్తో ప్రారంభం కానున్న అయిదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్కు భారత జట్టు ప్రకటించిన 18 మంది సభ్యుల బృందంలో కరుణ్ నాయర్కు స్థానం లభించింది. ప్రస్తుతం అతను అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇటీవల ఇంగ్లండ్ లయన్స్తో ఇండియా ఏ జట్టు తలపడిన అనధికారిక టెస్ట్ మ్యాచ్లో డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. కరుణ్ నాయర్ 2023, 2024 కౌంటీ ఛాంపియన్షిప్ సీజన్లలో నార్తాంప్టన్షైర్కు ప్రాతినిధ్యం వహించాడు. అక్కడ 10 మ్యాచ్ల్లో ఓ చిరస్మరణీయమైన డబుల్ సెంచరీతో సహా 736 పరుగులు చేశాడు. ఇక 2024-25 రంజీ ట్రోఫీలో విదర్భకు ఆడుతూ 16 ఇన్నింగ్స్ల్లో 863 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలున్నాయి. విజయ్ హజారే ట్రోఫీలో ఎనిమిది ఇన్నింగ్స్లో ఏకంగా 779 పరుగులు చేయగా, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024-25 టీ20 టోర్నీలో ఆరు ఇన్నింగ్స్ల్లో 255 పరుగులు చేసి నిలకడైన ప్రదర్శన కనబరిచాడు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతలు! మాజీ మంత్రికి మద్దతుగా వచ్చిన కార్యకర్తలు అరెస్ట్!
ఆ జిల్లా టమాటా రైతులపై ఊజీ ఈగ పిడుగు! దీంతో కొనేవారే..
సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్! FDలపై గరిష్ఠ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు!
అసైన్డ్ భూములకు రెక్కలు.. ఈ డీల్తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!
తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!
ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!
ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్సైట్: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!
సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్కు సూచన!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Sports #teamindia #Karun Nair #Team India #England Tour
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.